సినిమా పేరు: ఎవడు || సంగీత దర్శకుడు :దేవి శ్రీ ప్రసాద్ || గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి || గాయకుడు : శ్రేయ గోషాల్,కార్తీక్
పల్లవి:
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి
నీదాకా నను రప్పించావే…
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్ధం మార్చి
నేనంటే నువ్వనిపించావే
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
చరణం1
కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కుర్చున్నా
రాలేదే జాడైన లేదే
రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే పైగా తిడతావే
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావ నన్నిలా
నీ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా …
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
చరణం2
తెలిసీ తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపూ
ఏంచేస్తావ్ చెప్పు
తోచని తొందర పుడుతోంది తెగ తుంటరిగా నను నెడుతోంది నీ వైపూ
నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగ ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా…
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి